అమరావతి : ఏపీలోని పలు పారిశ్రామిక వాడల్లో రోజుకో ప్రమాదం చోటు చేసుకుంటుంది. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం కాటా సమీపంలోని చిన్న అవుటపల్లి శివారు ప్రాంతంలో ఉన్న ఇనుమ పరిశ్రమలో గ్యాస్లీకై ముడి ద్రావణం నలుగురు కార్మికులపై పడింది . దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఉంగుటూరు మండలం పొట్టిపాడుకు చెందిన శ్రీనివాసరావు, తాడిగడపకు చెందిన భవానీ శంకర్, పోరంకి చెందిన సత్యనారాయణ అనే ముగ్గురు వ్యక్తుల శరీరం దాదాపు 75శాతం కాలిపోయింది.
దీంతో అత్యవసర చికిత్స నిమిత్తం గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. ప్రసుత్తం ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల్లో బిహార్కు చెందిన నట్టుకుమార్ పరిస్థితి ఆరోగ్యకరంగా ఉందని వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.