అమరావతి : ఏపీలోని రాజమండ్రి ఎయిర్పోర్టులో (Rajahmundry Airport) ప్రమాదం చోటు చేసుకుంది. కొత్త టెర్మినల్ భవన పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో (Collapse) కార్మికులు క్షేమంగా బయటపడ్డారు.
రాజమండ్రి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను (International Airport) కల్పించేందుకు 2023లో నాటి కేంద్ర విమానాయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కొత్త టెర్మినల్ (New terminal ) భవన పనులకు భూమి పూజ చేశారు. సుమారు రూ. 350 కోట్లతో కొనసాగుతున్న పనులు ఊపందుకోవడంతో ప్రస్తుత కేంద్ర పౌరవిమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Minister Rammohan naidu) పరిశీలించారు.
ఈ ఎయిర్పోర్ట్ భవిష్యత్తులో రాత్రివేళ కూడా విమానాల ల్యాండింగ్ అయ్యేలా, టేకాఫ్ తీసుకునేలా విస్తరించడానికి చర్యలను తీసుకుంది కేంద్రప్రభుత్వం. ప్రస్తుతం రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి వారానికి 126 ఫ్లైట్లు రాకపోకలు సాగిస్తున్నాయి. రాజమండ్రి- హైదరాబాద్, రాజమండ్రి- చెన్నై, రాజమండ్రి- బెంగళూరుకు విమానాలు నడుస్తున్నాయి. ఇప్పుడున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని దీన్ని మరింత విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది.