అమరావతి : ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురుకి గాయాలయ్యాయి. మంగళవారం రాత్రి పలమనేరు జాతీయ రహదారిలోని అరగొండ మధురం హోటల్ వద్ద ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరిడివారిపల్లెకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి దినేశ్ కుమార్ రెడ్డి (23), అతడి స్నేహితులు ఉదయ్, నరేశ్, మరో ద్విచక్రవాహనంపై ఉన్న వంశీకి తీవ్ర గాయాలయ్యాయి.
వీరిని హుటాహుటినా బంగారుపాళ్యం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దినేశ్కుమార్ రెడ్డి మృతి చెందాడు. కుమారుడు మృతితో తల్లిదండ్రులు బోరున విలపించడం స్థానికుల కంట కన్నీరు తెప్పించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.