హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): మద్యం మత్తులో ఓ వ్యక్తి బాంబును నోటితో కొరికి ప్రాణాలను కోల్పోయిన ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం గడ్డం వారిపల్లెలో చోటుచేసుకొన్నది. సోమవారం రాత్రి చిరంజీవి అనే వ్యక్తి మద్యం మత్తులో బాంబును నోటితో కొరికాడు.
అది పేలడంతో అతడు మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.