Guntur GGH | గుంటూరులోని జీజీహెచ్ వద్ద విషాదం నెలకొంది. చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ రోగి బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన చెన్నంశెట్టి శ్రీనివాస్ తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతని భార్య కొంతకాలం కిందట మరణించింది. తాజాగా అతను కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 23వ తేదీన అతను ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకుంటానని వెళ్లిన శ్రీనివాస్ జీజీహెచ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.