అమరావతి : ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో గ్రామస్థులు భయాందోళలకు గురవుతున్నారు. మొత్తం 28 ఏనుగులు పెంగరగుంట, ముసలిమడుగు గ్రామాల్లోని పంట పొలాలను సైతం నాశనం చేస్తున్నాయి. అక్కడి నుంచి పలమనేరు పట్టణ పరిధిలోని గొబ్బిళ్లకోటూరుకు చేరుకుని పొలాల్లో నివాసముంటున్న రెండు ఇండ్లను నేలమట్టం చేశాయి. అక్కడ ఉన్న వస్తువులను, ట్రాక్టర్ను ధ్వంసం చేశాయి. అటవి శాఖ అధికారులు చర్యలు తీసుకుని ఏనుగుల గుంపు బారి నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు.