అమరావతి : సంసారంలో చిన్నపాటి మనస్పర్థలు రావడం సహజం. కాని దానిని జీర్ణించుకోలేని భార్య, భర్తల్లో ఎవరో ఒకరు అఘత్యానికి పాల్పడి కుటుంబ సభ్యులను దూరం చేసుకుంటున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో కేవలం రూ.500 రూపాయల కోసం భార్యాభర్తలు(Couple) గొడవపడి ఇద్దరు ఆత్మహత్యకు(Suicide) పాల్పడిన విషాద ఘటన చోటు చేసుకుంది.
స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు గుడివాడలోని వాసవీ నగర్లో నివాసముంటున్న కొలుసు రాంబాబు(45), కనకదుర్గ(40) దంపతులు. శనివారం మధ్యాహ్నం రూ.500 కోసం ఇద్దరూ గొడవ పడ్డారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య కనకదుర్గ ముందుగా ఇంట్లో ఉరివేసుకుని చనిపోగా, విషయం తెలుసుకున్న భర్త రాంబాబు మరో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు (Police) ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.