తిరుమల : తిరుపతిలో ఈనెల 8న జరిగిన తోపులాటలో (Tirupati Stampede) మృతి చెందిన తమిళనాడు మెట్టు సేలంకు చెందిన మల్లిక కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని (compensation) టీటీడీ బోర్డు సభ్యులు అందజేశారు. పరిహారం చెక్ ను మృతురాలు మల్లిక ఏకైక కుమారుడు రమేష్ కు టీటీడీ (TTD) బోర్డు సభ్యులు నరేష్ కుమార్, రామ్మూర్తి, శాంతారాం, కృష్ణమూర్తి అందజేశారు.
సభ్యులు మాట్లాడుతూ పాలక మండలి తీర్మానం ప్రకారం పరిహారం చెల్లించగా, బాధితుల కుటుంబంలో ఒకరికి టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చేందుకు వివరాలు తీసుకున్నామని తెలిపారు. వైకుంట ద్వార దర్శనం (Vaikunta Dwara Darsan) సందర్భంగా తిరుపతిలోని టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మొత్తం 6గురు చనిపోగా మరో 50 మంది గాయపడ్డారు.
మృతుల కుటుంబాలకు నేరుగా ఇళ్లవద్దే పరిహారం అందజేసేందుకు బోర్డు సభ్యులతో మూడు బృందాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా శుక్రవారం మృతురాలి కుటుంబ సభ్యులు ఉండే గ్రామానికి బోర్డు సభ్యులు వెళ్లి పరిహారం అందజేసి పరామర్శించారు.