హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ(Sonia Gandhi)పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ బేగంబజార్ పోలీసులు (Begam Bazar Police) ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) నారాయణ స్వామి(Narayana Swamy) పై కేసు నమోదు చేశారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి సోనియా కారణమంటూ ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలపై జనవరి 9న కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా జనవరి 12న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడిన వీడియో ఫుటేజ్ ను పరిశీలించి ఆయనపై ఐపీసీ 504 , 505(2), r/w 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వైఎస్సార్ సోనియాకు విధేయుడుగా ఉండేవారని 2004, 2009 రెండు సార్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఏపీ మంత్రి ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.