అమరావతి : తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు బయలు దేరిన భక్తులు తృటిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బెంగుళూరు నుంచి తిరుమలకు కారులో ఏడుగురు సభ్యులు గల ప్రయాణికులు బయలు దేరారు. ఇవాళ తిరుపతి జిల్లా చిన్న గొట్టిగల్లు వద్ద ప్రమాదవశాత్తు కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో చెరువులో నీరు తక్కువగా ఉండటంతో వారంతా పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు.