అమరావతి : ఏపీలో గడిచిన 24గంటల్లో కొత్తగా 671 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,30,503కు పెరిగింది. తాజాగా 1,272 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 20,53,863 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 14,219కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9141 యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసుల్లో అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 671, చిత్తూరులో 102 కేసులు పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. కొవిడ్తో కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, వైఎస్సార్ కడప, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.