తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారని వీరికి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 66,946 మంది భక్తులు దర్శించుకోగా 26,990 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.73 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.