అమరావతి : ఆంధ్రప్రదేశ్లో 24 గంటల్లో 30,578 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 4,605 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 10మంది కరోనా బాధితులు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 11,729 మంది కోలుకున్నారని ఏపీ వైద్య ఆరోగ్యాధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 93,488 యాక్టివ్ కేసులున్నాయని వివరించారు. తూర్పుగోదావరిలో జిల్లాలో 642 , పశ్చిమ గోదావరి జిల్లాలో 539 , గుంటూరు జిల్లాలో 524, నెల్లూరు జిల్లాలో 501 అత్యధికంగా కేసులు నమోదయ్యాయని వివరించారు.