అమరావతి : ఏపీలో అక్రమంగా రవాణా చేస్తున్న బియ్యాన్ని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని అందిన సమాచారం మేరకు విజిలెన్స్ , రవెన్యూ, పౌరసరఫరాల అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం లింగా గ్రామం నుంచి బిక్కవోలుకు 450 బస్తాల్లో సుమారు 23.480 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రవాణా చేస్తుండగా రాజానగరం మండలం దివాన్చెరువు సమీపంలో పట్టుకున్నారు.
బియ్యం జగ్గయ్యపేట మండలానికి చెందిన జగదీష్ అనే వ్యక్తికి చెందినవిగా గుర్తించిన అధికారులు లారీని, బియ్యాన్ని సీజ్ చేశారు. లారీ డ్రైవర్, యజమాని, బియ్యం యజమాని, సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు రాజానగరం పోలీస్ స్టేషన్కు సిఫార్సు చేశామని విజిలెన్స్ ఎస్పీ రవికుమార్ తెలిపారు.