అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 30,886 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని వైద్యాధికారులు తెలిపారు. ఈ పరీక్షల్లో కొత్తగా 4,198 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని, ఐదుగురు చనిపోయారని వెల్లడించారు. 9,317 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని, రాష్ట్రంలో ప్రస్తుతం 88,364 యాక్టివ్ కేసులున్నాయని వివరించారు. తూర్పు గోదావరి జిల్లాలో 555, కృష్ణా జిల్లాలో 528, గుంటూరు జిల్లాలో 485 మంది, కర్నూలులో 459 మంది అత్యధికంగా కరోనా బారిన పడ్డారని పేర్కొన్నారు.