అమరావతి : అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని విశాఖ పట్నం పోలీసులు పట్టుకున్నారు. రాత్రి విశాఖ రైల్వే న్యూకాలనీలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచిన 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన మహ్మాద్ షఫీఖాన్ను, మహారాష్ట్రకు చెందిన షేక్ మొహ్సేన్, విజయ్ మనోహర్ హారానా, జహీర్ ఖాన్ రెహ్మాత్ ఖాన్, అదుపులోకి తీసుకుని వీరి నుంచి 40 కిలోల గంజాయి, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నలుగురిపై కేసు నమోదు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.
మరో తనిఖీలో రైల్వేస్టేషన్ ప్రాంతంలోని జ్ఞానాపురం ద్విచక్ర వాహనాల పార్కింగ్ వద్ద గంజాయిని తరలిస్తున్న దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని సెబ్ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 3.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పరారైన మరో వ్యక్తి కోసం సెబ్ అధికారులు గాలిస్తున్నారు.