తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి దర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండి, శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలిచియున్నారు. వీరికి 40 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 73,323 మంది భక్తులు దర్శించుకోగా 41,041 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.20 కోట్లు వచ్చిందని తెలిపారు.