అమరావతి : తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది . ఆపద మొక్కుల వాడు శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) అధికారులు వివవరించారు. నిన్న 76,695 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 34,395 తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.90 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.