అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,042 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్-19తో 28 మంది చనిపోయారు. 3,748 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా కేసుల సంఖ్య 19,05,170కు చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 33,230గా ఉంది.
జిల్లాల వారీగా తాజాగా సంభవించిన కరోనా మరణాల వివరాలిలా ఉన్నాయి. చిత్తూరులో ఏడుగురు, తూర్పు గోదావరి, నెల్లూరులో నలుగురు చొప్పున, వైఎస్ఆర్ కడపలో ముగ్గురు, అనంతపూర్, గుంటూరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు చొప్పున, కృష్ణ, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మరణించారు.