తిరుమల : తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 30 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 63,145 మంది భక్తులు దర్శించుకోగా 22,411 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు వచ్చిందని తెలిపారు.
కాగా ఈరోజు సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ రామసుబ్రహ్మణ్యం దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవి ధర్మారెడ్డి జస్టిస్కు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ ప్రసాదం, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు.