తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియుండగా వీరికి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 79,471 మంది భక్తులు దర్శించుకోగా 36,594 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 4. 90 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.