తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 27 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 69,211 మంది భక్తులు దర్శించుకోగా 26,764 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.11 కోట్లు వచ్చిందని వెల్లడించారు.