తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాకతో ఏడు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వీరికి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 68,850 మంది భక్తులు దర్శించుకోగా 21,280 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.61 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
రేపు డయల్ యువర్ ఈవో
డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి ఫోన్ నెంబరు 0877-2263261 ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని సూచించారు.