తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది . నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.నిన్న స్వామివారిని 51,376 మంది భక్తులు దర్శించుకోగా 24,878 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి ఆదాయం రూ. 4.60 కోట్లు వచ్చిందని తెలిపారు.