తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు శుక్రవారం తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.దీంతో 31 కంపార్టుమెంట్లలో శ్రీవారి సర్వదర్శనానికి వేచి యుండగా వీరికి దర్శనం 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
కాగా నిన్న 61,304 మంది భక్తులు వెంకన్న స్వామిని దర్శించుకోగా 30,133 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.46 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.
22న మిక్స్డ్ బియ్యం టెండర్ కమ్ వేలం
ఈనెల 22న తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం కార్యాలయంలో మిక్స్డ్ బియ్యం టెండర్ కమ్ వేలం జరుగనుందని అధికారులు వెల్లడించారు. మొత్తం 12,880 కిలోల బియ్యాన్ని వేలానికి సిద్ధంగా ఉంచామన్నారు.
వేలంలో పాల్గొనే వ్యక్తులు రూ.590 డిడి తీసి టెండరు షెడ్యూల్ పొందవచ్చని, వేలంలో పాల్గొనేందుకు రూ.25వేలు ఇఎండిగా చెల్లించాలని సూచించారు. ఇతర వివరాల కోసం మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని గాని, 0877-2264429 ఫోన్ నంబరులోగాని సంప్రదించాలని తెలిపారు.