న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఓ వైపు కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంటే.. మరో వైపు ఆక్సిజన్ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో 22 మంది కరోనా రోగులు చనిపోయిన ఘటన మరవక ముందే.. అలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. తాజాగా ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో 20 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. మరో 200 మందికి పైగా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం అర గంటకు మాత్రమే ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు.
ఢిల్లీలోని బాట్రా హాస్పిటల్నూ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆస్పత్రిలో 350 మంది రోగులు కరోనా చికిత్స పొందుతున్నారని ఆ ఆస్పత్రి వైద్యుడు గుప్తా తెలిపారు. ఇవాళ ఉదయం ఢిల్లీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఒక ఆక్సిజన్ ట్యాంకర్ను సమకూర్చిందని చెప్పారు. ఇది కేవలం గంటన్నర వరకు మాత్రమే సరిపోతుందన్నారు. ప్రతి రోజు తమ ఆస్పత్రికి 8 వేల లీటర్ల ఆక్సిజన్ అవసరం. కానీ ఢిల్లీ ప్రభుత్వం పంపింది మాత్రం కేవలం 500 లీటర్ల ఆక్సిజన్ మాత్రమే అని గుప్తా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..