ముంబై: కరోనా కట్టడి కోసం తాజాగా రెండు లేదా మూడు వారాలపాటు లాక్డౌన్ విధించాలని భావించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఒకడుగు వెనక్కు వేసింది. రాష్ట్రంలో లాక్డౌన్ ఉండదని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం మీడియాకు చెప్పారు. కానీ ఆ తరహాలో 15 రోజుల పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 144 ఆంక్షలు అమలులో ఉంటాయని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. లాక్డౌన్ లేకున్నా ఆ తరహాలోనే ఆంక్షలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా మరింత కఠినంగా ఆంక్షలు అమలులోకి వస్తాయని ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. దవాఖానల్లో పడకలు, ఆక్సిజన్ కొరత వేధిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉత్పత్తి చేస్తున్న ఆక్సిజన్ మొత్తం వైద్య అవసరాలకే ఉపయోగించాలని ఉద్ధవ్ ఠాక్రే కోరారు. వైద్య సదుపాయాలను క్రమంగా పెంచుతున్నట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బిట్ కాయిన్ ఆల్టైం రికార్డు@62,377 డాలర్లు!
తెలుగు ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని ఉగాది శుభాకాంక్షలు
ఇదెక్కడి పోయేకాలం.. యువకుడి జననాంగం కోసేసిన నపుంసకులు..!
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు
రెండు కాళ్లు, మూడు చేతులతో.. ఒడిశాలో జన్మించిన అవిభక్త కవలలు
రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు
IPL 2021:టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్కతా
IPL 2021:టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్కతా
బాయ్ఫ్రెండ్తో ఐరాఖాన్ బాక్సింగ్..వీడియో వైరల్
కొవిడ్ అంతానికి చాలా సమయం పడుతుంది: డబ్ల్యూహెచ్ఓ
అంత తక్కువ ధరకు మా వ్యాక్సిన్ అమ్మలేం: ఆర్డీఐఎఫ్