తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. భక్తులు 23 కంపార్టుమెంట్లలో స్వామివారి దర్శనానికి వేచియున్నారు. వీరికి 20 గంటలో దర్శనం కలుగుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. నిన్న స్వామివారిని 65,062 మంది భక్తులు దర్శించుకోగా 25,761 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.04 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. వారణాసి ఆలయ శ్రీ కాశీనాథ్ సంస్థాన్ పీఠాధిపతి శ్రీమద్ సంయామింద్రా తీర్థ స్వామిజీ స్వామివారిని దర్శించుకున్నారు. స్వామిజీని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు.