తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తిరుమల (Tirumala) లో కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడియున్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం (Sarvadarshanam) 20 నుంచి 24 గంటల్లో అవుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 78,686 మంది భక్తులు దర్శించుకోగా 37,888 మంది తలానీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.54 కోట్లు వచ్చిందన్నారు.