అమరావతి : ఏపీలో కొత్తగా 184 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైద్యసిబ్బంది 29,595 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్ బారిన పడి కృష్ణా జిల్లాకు చెందిన ఒకరు మృతి చెందారని తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 14,443కి చేరింది. ఇప్పటి వరకు 20,56, 501 మంది బాధితులు కొవిడ్ బారిన నుంచి కోలుకున్నారని వివరించారు.
చిత్తూరులో 39 మంది, గుంటూరులో 20 మంది , ఈస్ట్గోదావరిలో 14, వెస్ట్ గోదావరిలో 27మంది, అనంతపురంలో 11, కృష్ణాలో 20 , విశాఖపట్నంలో 28 మంది అత్యధికంగా కొవిడ్ బారిన పడ్డారు.