తిరుమల : భక్తగ్రేసరుడు వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 21 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధదికారులు వివరించారు. నిన్న స్వామివారిని 73,853 మంది భక్తులు దర్శించుకోగా 22,551 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3.47 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.