తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు తిరుమల కొండకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. మూడు కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియుండగా వీరికి 18 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 69,640 మంది భక్తులు దర్శించుకోగా 28,649 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి ఆదాయం రూ. 4.65కోట్లు వచ్చిందని వివరించారు.
ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం
తిరుమల : హైదరాబాద్కు చెందిన పన్నాల పర్వతాల రెడ్డి ( పీపీరెడ్డి ట్రస్ట్ చైర్మన్), వంశీధర్ రెడ్డి కలిసి ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయలు విరాళం అందించారు. ఈ మేరకు విరాళం డీడీలను బుధవారం తిరుమలలోని కార్యాలయంలో టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డికి అందజేశారు.