తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కంపార్టుమెంట్లన్నీ నిండి ఏటీజీహెచ్ వరకు భక్తులు వేచిఉన్నారు. వీరికి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 68,675 మంది భక్తులు దర్శించుకోగా 32,533 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.