తిరుమల : తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు (Compartments) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 63,535 మంది భక్తులు దర్శించుకోగా 28,685 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3. 81 కోట్లు వచ్చిందని తెలిపారు.
తిరుమలలో అంగ ప్రదక్షిణ టోకెన్ల ఆన్లైన్ కోటా విడుదల
ఈనెల 10న తిరుమలలో అంగ ప్రదక్షిణ కోసం రేపు(శనివారం) మధ్యాహ్నం 10 గంటలకు ఆన్లైన్ కోటాను విడుదల చేస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. మొత్తం250 అంగ ప్రదక్షిణ టోకెన్లను విడుదల చేస్తున్నామని వివరించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో అంగప్రదక్షిణం టోకెన్లను బుక్ చేసుకోవాలని కోరారు.