తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. 29 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచిఉన్నారని వివరించారు. కాగా నిన్న శ్రీవారిని 66,001 మంది భక్తులు దర్శించుకోగా 38,831 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.01 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
తిరుమలకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ వస్తువులను, బాటిళ్లను వెంట తీసుకురావొద్దని మరోసారి సూచించారు. ఈనెల 1 నుంచి తిరుమల కొండపై ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. అలిపిరి వద్ద సిబ్బంది తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ కవర్లను, బాటిళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు.