అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 33,050 వేల మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించామని ఏపీ వైద్య అధికారులు వెల్లడించారు. కృష్ణా, ప్రకాశం,పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని తెలిపారు. దీంతో కరోనా బారి పడి 14,477 మంది మృత్యువాత పడ్డారని వివరించారు.
చిత్తూరు జిల్లాలో 32 మంది, గుంటూరులో 20 మంది, కృష్ణాలో 14, విశాఖపట్నంలో 15 మంది, వెస్ట్గోదావరిలో 14 మంది కరోనా బారిన పడ్డారని వివరించారు.