అమరావతి : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల (Tirumala) కు చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31
కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 73,051 మంది భక్తులు దర్శించుకోగా 34,599 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 2. 92 కోట్లు ఆదాయం (Income) వచ్చిందని తెలిపారు.