అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 117 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21,360 మందికి పరీక్షలు నిర్వహించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. విశాఖలో ఒకరు కరోనాతో మృతి చెందినట్లు వివరించారు. ప్రస్తుతం 2,961 యాక్టివ్ కేసులు ఉన్నాయని 241 మంది కోలుకున్నారని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.
చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖ పట్నం,నెల్లూరు జిల్లాలో అత్యధిక పాజిటీవ్ కేసులు నమోదయినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3 కోట్ల 4,569 మంది నుంచి శాంపిల్స్ సేకరించామచి తెలిపారు. ఇప్పటివరకు 20లక్షల 67,200 మందికి పాజిటివ్ కేసులకు గాను 20లక్షల 49,823 మంది డిశ్చార్జ్ కాగా 14,416మంది మరణించారని అధికారులు తెలిపారు