తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామి వారి దర్శనానికి 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని వీరికి 10 గంటల్లో దర్శనం సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 72,243 మంది భక్తులు దర్శించుకోగా 32,652 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.41 కోట్లు వచ్చిందని తెలిపారు.