తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దర్శనానికి వచ్చిన భక్తులతో 5 కంపార్టుమెంట్లు (Compartments) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 70,158 మంది భక్తులు దర్శించుకోగా 24,801 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు హుండీలో వేసిన కానుకల వల్ల టీటీడీకి రూ.3.51 కోట్లు ఆదాయం(Hundi Income) వచ్చిందని తెలిపారు.