అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 28,509 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 248 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఎవరూ కూడా మృతి చెందలేదని ఏపీ వైద్య ఆర్యోగ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటిన్లో పేర్కొన్నారు.
కాగా కరోనా నుంచి మరో 253 మంది కోలుకున్నారని, ప్రస్తుతం రాష్ట్రంలో 2,158 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వివరించారు.