కౌటాల, జనవరి 26: క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో ఆడాలని జిల్లా పరిషత్ చైర్మన్ కోనేరుకృష్ణ్ణారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో కోనేరు యువసేన ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. కాసేపు వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు.
ఆయన వెంట కౌటాల, చింతలమానెపల్లి ఎంపీపీలు బసార్కర్ విశ్వనాథ్, డుబ్బుల నానయ్య, సర్పంచ్ వొజ్జల మౌనిష్, ఉపసర్పంచ్ పసునూరి తిరుపతి, కో ఆప్షన్ సభ్యుడు అజ్మత్ అలీ, సీనియర్ ఉపాద్యాయుడు లూర్డు రాజు, నాయకులు డబ్బా బాపు, రవీందర్ గౌడ్, మధుకర్, అశోక్, సోల్ల బాపు, ప్రకాశ్, కత్తెర్ల ఆత్మరాం, రమేశ్, రాంచందర్, బ్రహ్మయ్య, గోపాల్, సాయి, నిర్వాహకులున్నారు.