ఎదులాపురం, జనవరి 12 : ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారం భిస్తారని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యాధికారులతో గురువారం కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ పకడ్బందీగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తం గా 16,533 కేంద్రాల్లో కంటి వెలుగు స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి రోజూ 120 నుంచి 130 మంది వరకు ప్రతి కేంద్రంలో స్క్రీనింగ్ నిర్వహించాలన్నారు. అవసరమైన వారి కి ఉచితంగా కళ్లజోళ్లు, మందులు అందిస్తా మని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణకు అన్ని ఏర్పా ట్లు చేపడుతున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 27, పట్టణ ప్రాంతంలో 6 కేంద్రాల ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే 33 టీమ్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటి వరకు 28,023 రీడింగ్ గ్లాసులు జిల్లాకు సరఫరా చేశారని తెలిపారు. డీఎంహెచ్వో నరేంద ర్ రాథోడ్, డీపీవో శ్రీనివాస్, డీపీఆర్వో భీమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
భైంసా, జనవరి 12 : జనవరి 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్ర మానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొ న్నారు. గురువారం పలు మండలాల్లో ఆయన పర్యటించారు. భైంసాలోని మున్నూరుకాపు సం ఘంతో పాటు లోకేశ్వరం మండలం బిలోలి గ్రామంలో పర్యటించి మాట్లాడారు. ఎలాంటి లోటు పాట్లు లేకుండా షెడ్యూల్ ప్రకారం కార్యక్ర మం నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అదనపు కలె క్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా వైద్యాధికారి ధన్ రాజ్, ఆర్డీవో రవికుమార్, డా. శ్రీనివాస్, మాస్ మీడియా అధికారి రవీందర్, భైంసా డిప్యూటీ డీఎంఅండ్ హెచ్వో ఇద్రిజ్ ఉన్నారు.
దేగాంలో..
భైంసాటౌన్, జనవరి 12 : కంటి వెలుగు కార్యక్రమాన్ని దేగాంలో ప్రారంభించనున్న నేప థ్యంలో పంచాయతీ భవనాన్ని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు. ఇక్కడి సౌకర్యాలను ప్రజా ప్రతినిధులు, అధికారులకు అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ హేమం త్ బోర్కడే, డీఎంఅండ్ హెచ్వో ధన్రాజ్, ఆర్డీవో రవి, తహసీల్దార్ చంద్రశేఖర్, మహాగాం పీహెచ్సీ వైద్యాధికారి శ్రీకాంత్, హెచ్ఈవో సలీం, సర్పంచ్ బొబ్బిలి శ్రీనివాస్, వార్డు సభ్యులు గోవర్ధన్ రెడ్డి, నాయకులు లక్ష్మణ్ పాల్గొన్నారు.
నిర్మల్లో..
నిర్మల్ చైన్గేట్, జనవరి 12 : నిర్మల్లోని ఏఎన్రెడ్డి కాలనీలో బీసీ సంఘ భవనంలో ఏర్పా టు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపడుతున్నదని పేర్కొ న్నారు. ఎప్పటి కప్పుడు వివరాలు నమోదు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్క డే, డీఎంహెచ్వో ధన్రాజ్ ఉన్నారు.