నిర్మల్ టౌన్, మార్చి 18 : పేస్కేల్ను అమలు చేస్తూ జీవో విడుదల చేయడంపై జిల్లా సెర్ప్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వం అధికారికంగా జీవో నం.11ను విడుదల చేయడంతో జిల్లాలో సెర్ఫ్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో 2005 నుంచి విధులు నిర్వర్తిస్తున్న సెర్ప్ ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో పని చేస్తూ మహిళ్లా సంఘాలను బలోపేతం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో 116 మందికి ప్రయోజనం కలుగుతుందని సెర్ప్ ఉద్యో గులు పేర్కొంటున్నారు. ఏపీడీలు, డీపీఎం, ఏపీఎం, సీసీలు, ఏపీవోలకు ప్రయోజనం కలుగ నుంది. పేస్కేల్ జీవోతో పాటు వేతనానికి సంబం ధించిన జీవోను కూడా విడుదల చేసినట్లు సెర్ప్ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. తమ సేవలకు గుర్తింపుగా ఉగాది కానుకగా ప్రకటించిన ప్రభు త్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.
ఎదులాపురం, మార్చి 18 : ఆదిలాబాద్ జిల్లాలో 154 మంది సెర్పె ఉద్యోగులకు ప్రయోజ నం కలుగనుంది. ఏపీడీ ఒకరు, డీపీఎం 7, ఏపీఎం 23, సీసీ 69, ఎంఎస్సీసీ 45, అడ్మిన్ అసిస్టెంట్ 6, అంటెండర్లు 3 ఉన్నారు. వీరికి పే స్కేల్ వర్తింపచేయనున్నారు.
ఎదులాపురం, మార్చి 18 : 23 సంవత్సరా లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న సెర్ప్ ఉద్యోగులను ఏ ప్రభ్వుతం గుర్తించ లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని ఐకేపీ జిల్లా యూనియన్ అధ్యక్షుడు శుద్ధోదన్ పేర్కొన్నారు. శనివారం డీఆర్డీఏ కార్యాలయం ఎదుట సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ తమ బాధలను అర్థం చేసుకొని పే స్కేల్ వర్తించే విధంగా జీవో నంబర్ 11ను విడుదల చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సరైన సమ యంలో సహకారం అందించేందుకు జిల్లా సెర్ప్ ఉద్యోగులు ముందు ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంలు చంద్రశేఖర్, నారా యణ, ఉపాధ్యక్షుడు చిట్యాల గంగన్న, కోశాధి కారి సవితా, గౌరవ అధ్యక్షుడు ఏడీడీ ఆర్డీవో చరణ్దాస్, డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు ఎంఎస్సీసీలు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఎదులాపురం, మార్చి 18 : గత 23 సంవత్సరాల నుంచి పాలకులకు విన్నవించినా పట్టించుకోలేదు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ తమ 23 ఏళ్ల సమస్యను పరిష్కరించారు. జీవో నంబర్ 11 విడుదలతో తము పేస్కేల్ వర్తించ నుంది. ఉద్యోగ భద్రత కలిగింది. భవిష్యత్ సెర్ప్ ఉద్యోగులు సీఎం కేసీఆర్ వెంటే ఉంటా రు. అండగా నిలుస్తారు.
శుద్ధోదన్, జేఏసీ అధ్యక్షుడు (ఆదిలాబాద్)
నిర్మల్ టౌన్, మార్చి 18 : ఏన్నో ఏళ్లుగా మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్న సెర్ప్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పేస్కేలు అమలు చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తున్నాం. సీఎం కేసీఆర్ ఉద్యో గులకు పేస్కేలును అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఉగాది కానుకగా జీవోను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది.
– గంగారెడ్డి, ఏపీఎం(నిర్మల్)