నర్సాపూర్(జీ), సెప్టెంబర్ 13 : నిర్మల్లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం నర్సాపూర్(జీ) మండలానికి చెందిన యువకులు మంత్రి ఇంద్రరకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నర్సాపూర్(జీ) మండల కేంద్రానికి చెందిన 46 మంది ముదిరాజ్ సంఘ సభ్యులు, రాంపూర్కు చెందిన 18 మంది యువకులు, కుస్లీ గ్రామానికి చెందిన 20 మంది యువకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నర్సాపూర్కు చెందిన అడ్వాకేట్ అజయ్, బీజేపీకి చెందిన సుభాష్, రాజు పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నేతలు, ప్రజాప్రతి నిధులు, యువకులు పెద్దఎత్తున పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం పని చేసి నియోజక వర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నర్సాపూర్(జీ) జడ్పీటీసీ చిన్న రామయ్య, సర్పంచ్ రాంరెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కొండ్ర రమేశ్, మండల కన్వీనర్ గోపిడి గంగారెడ్డి, ఫసి, మహేందర్, రాంపూర్ యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్, నవీన్, కుస్లీ సర్పంచ్ భూమేశ్ పాల్గొన్నారు.