సోన్, డిసెంబర్ 20 : అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సోన్కు చెందిన తోకల నరేశ్ (25) ట్రాక్టర్పై నుంచి కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సోన్ ఎస్ఐ సంతోషం రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సోన్కు చెందిన తోకల నరేశ్.. సోన్ నుంచి కూచన్పెల్లి గ్రామానికి ట్రాక్టర్పై వెళ్తున్నాడు. గ్రామ సమీపంలో ట్రాక్టర్ను వేగంగా తిప్పడంతో ముందు టైర్ బండరాయిపై ఎక్కింది. దీంతో నరేశ్ అదుపుతప్పి కిందపడిపోయాడు.
ఈ సమయంలో టైరు అతనిపై నుంచి ఎక్కడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తోకల నరేశ్కు ఏడాది క్రితమే నర్సాపూర్(జీ) మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన అనూషతో వివాహమైంది. కుటుంబపోషణ కోసం ట్రాక్టర్ నడుపుతున్న నరేశ్ అనుకోని ప్రమాదంలో మృతి చెందడంతో భార్య, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.