దండేపల్లి, మే 26 : భానుడు భగభగ మండుతున్నాడు. చల్లదనం కో సం పిల్లలతో పాటు పెద్ద లూ తహతహలాడుతున్నారు. చెరువులు, కుంట లు, బావులు, కాలువల ను ఆశ్రయిస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నా రు. సరదాగా ఈతకోసం వెళ్లి మృత్యువాత పడుతూ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. నీటిలోతు, ప్రవాహాన్ని అంచ నా వేయలేక అందులోకి దిగుతూ విగతజీవుల్లా మారుతున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం ఉండగా, వేసవి సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వేసవి సెలవుల్లో ప్రమాదాలు అనేకం జరుగుతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాం తాల పిల్లలు సరియైన జాగ్రత్తలు తీసుకోకుండానే ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడుతుంటారు. వచ్చీ..రాని ఈతతో బావులు, కుంటలు, కాల్వల్లోకి దిగి.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతుంటారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన గోపులపురం కార్తిక్(18) హోలీ పండుగ రోజు తానిమడుగు డెలివరీ పాయింట్ వద్ద నీట మునిగి మృతిచెందాడు.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాత్విక్ భీంసరి వాగులో స్నానం చేస్తుండగా మృత్యువాతపడ్డాడు. కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం నదీమాబాద్ తాటిపల్లి గ్రామం వద్ద పెన్గంగ నదిలో స్నానానికి దిగిన ఆలం సాయి(23), ఉప్పుల సంతోష్(23), ఎల్మూరే ప్రవీణ్(24), పనస కమలాకర్(24) ఈత రాక మృతిచెందారు.ఈ నెల19న కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బుద్దిపెల్లి గ్రామానికి చెందిన దుర్గం కీర్తన్గౌడ్(24) హనుమాన్ మాల ధరించడానికి స్నేహితులతో కలిసి వచ్చి, గూడెం గోదావరిలో పుణ్యస్నానం ఆచరించడానికి దిగాడు. ఈత రాకపోవడంతో మృత్యువాతపడ్డాడు.
ఈత పూర్తిగా వచ్చిన వా రి సహకారంతో లోతు తక్కువగా ఉన్న ప్రదేశం లో మాత్రమే ఈత నేర్చుకోవాలి. ఈత రాని వా రు తప్పనిసరిగా స్వి మ్మింగ్ జాకెట్లు ధరించా లి. గ్రామీణ ప్రాంతాల్లో వీటి సౌకర్యం ఉండవు కాబట్టి తుంగ, జీలుగ బెండ్లను కట్టగా చేసుకొని వీపుకు కట్టుకొని నీటిలోకి దిగాలి. ద్విచక్రవాహనాల ట్యూబ్లలో గాలి నింపుకొని శిక్షణ పొందవచ్చు. చెరువులు, కాలువల్లో మట్టికోసం తీసిన గోతులు ఉంటాయి కాబట్టి వాటి ల్లో అస్సలు దిగకూడదు. చెరువుల్లో చేపల కోసం అమర్చిన వలలు ఉంటా యి. అందులో కూడా చిక్కుకునే ప్రమాదముంటుంది. చెరువులు, కాల్వల్లో తామర తీగలు ఉన్న ప్రాంతంలో ఈతకు అస్సలు వెళ్లకూడదు.
కాల్వల్లో నీటి ప్రవాహ వేగం గురించి అంచనా వేయలేం. అందులో ఈత వచ్చిన వారు దిగినా కొట్టుకుపోయే అవకాశముంటుంది.ఇక రాని వాళ్లు ఈతకు వెళ్లకపోవడమే మంచింది. కాల్వ గేట్ల వద్ద నీరు పైకి నిశ్చలంగా కనిపించినా కింది భాగంలో ప్రవాహం ఉధృతంగా ఉం టుంది. ఈతకు దిగకపోవడమే శ్రేయస్కరం. పాడుబడ్డ బావుల్లోకి అస్సలు వెళ్లకూడదు. వీటి దరులు కూలిపోయే అవకాశం ఉంటుంది. అలాగే బావుల్లో కార్బన్డయాక్సైడ్ వ్యాపించి ఉండవచ్చు.
చెరువులు, కాలువల్లో చిక్కకు పోయిన వ్యక్తిని గుర్తించి బయటకు తీయగానే ప్రాథమిక చికిత్స అందించాలి. గుండె కొట్టుకోకుంటే ఛాతిపై నొక్కాలి. పడుకోబెట్టి పొట్టపై మెల్లిగా నొక్కి నీళ్లను బయటకు తీయాలి. బాధితుడికి శ్వాస ఆడకపోతే నోటి ద్వారా శ్వాస అందించాలి. ఆపై వీలైనంతా త్వరగా సమీపంలోని దవాఖానకు తరలించాలితరలించాలి.