మందమర్రి అక్టోబర్ 16: కూచిపూడి నృత్య గురువు వెంపటి చిన్నసత్యం జయంతిని పురస్కరించుకుని నృత్య కళా సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రాకం సంతోష్ ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలోని సింగరేణి సీఈఆర్ క్లబ్లో ఆదివారం ప్రపంచ కూచిపూడి నృత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, బడికెల సంపత్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు జే.రవీందర్, మద్ది శంకర్, భట్టు రాజ్కుమార్, సీనియర్ కళాకారులు సాదనవేణి ప్రభాకర్, హన్మాండ్ల మధు, ఉప్పులేటి నరేశ్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 200 మందికి పైగా కూచిపూడి నృత్య కళాకారులు పాల్గొన్నారు.
చిన్నారుల నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. కూచిపూడి నృత్య గురువులు గాజుల నర్మద, అశ్విని, వసుధ, ఊర్మిళ, రేఖ, అర్చన, రమేశ్ను నిర్వాహకులు శాలువాల తో సత్కరించారు. వేడుకల్లో పాల్గొన్న కళాకారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నృత్య కళా సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రాకం సంతోష్, ప్రధాన కార్యదర్శి మంతెన సురేందర్, రామగిరి అర్జున్, చొప్పదండి దుర్గ, రిథం సది, ఉడుత సాగర్, లక్ష్మణ్, విజయ్, స్టాలిన్, కల్యాణ్, ప్రవీణ్, అరుణ్సాయి, రమేశ్, సుమంత్, అంజలి, తదితరులు పాల్గొన్నారు.