చెదరని జ్ఞాపకాలకు, మధుర స్మృతులకు ఆధారం ఫొటో. మనసుకు నచ్చిన, హత్తుకునే చిత్రాలను కెమెరాలో బంధించి, పదికాలాల పాటు పదిలంగా దాచుకోవచ్చు. మది పలికే ఎన్నో భావాలు ఒక చిత్రం చెబుతుంది. ప్రతి ఫొటో వెనుక ఓ అనుభూతి.. ఓ జ్ఞాపకం నిక్షిప్తమై ఉంటుంది. ఇలాంటి ఫొటోలను ఒడిసిపట్టి.. భవిష్యత్ కాలానికి గుర్తుగా మిగిల్చేది ఫొటోగ్రఫీ.. నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నమస్తే తెలంగాణ ప్రత్యేక చిత్రాలు..
మంచిర్యాల స్టాఫ్ ఫొటోగ్రాఫర్ :
ఎన్నో మధురానుభూతులు మిగిల్చేది ఫొటోనే. కొన్నింటిని జీవితాంతం దాచుకుంటాం. ఇలాంటి ఫొటోగ్రఫీకి ఒక రోజు ఉంది. 1839, ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం లూయిస్ జేఎం డాగ్యూరే ఫొటోగ్రఫీపై పేటెంట్ హక్కులను కొనుగోలు చేసి, దానిని ప్రపంచానికి ఉచిత బహుమతిగా అందించింది. అందుకే ప్రతి ఏడాది ఆగస్టు 19న ‘ప్రపంచ ఫొటోగ్రఫీ డే’ గా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ తన కెమెరాలో బంధించిన కొన్ని చిత్రాలు…