నిర్మల్ అర్బన్, ఆగస్టు 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతోనే పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్లోని కలెక్టరేట్ ఎదుట నాగనాయిపేట్ డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. పేదల ప్రజలకు లక్షల విలువ చేసే ఇండ్లను ఉచితంగా మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మైనార్టీ లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
లబ్ధిదారులు డబుల్ బెడ్రూం ఇండ్లల్లో మౌలిక సమస్యలు తీర్చేందుకు కృషి చేయలని మంత్రికి వివరించారు. లబ్ధిదారుల సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేసిందని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో దశల వారీగా మైనార్టీల సమస్యలు గుర్తించి పరిష్కారం చేశామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, నాయకులు పాకాల రాంచందర్, వార్డుల కౌన్సిలర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన నూతన డీఎం
నిర్మల్ ఆర్టీసీ డిపో మేనేజర్గా ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రతిమారెడ్డి బుధవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేశారు. అందరి కృషితో డిపోను లాభాల బాటలో నడిపించాలని సూచించారు. ఆమె వెంట రమణ, తదితరులు ఉన్నారు.
మంత్రిని కలిసిన ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం నేతలు
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఎస్టీయూ సంఘం నాయకులు బుధవారం నిర్మల్లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఇక్కడ ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు జుట్టు గజేందర్, నాయకులు లక్ష్మణ్, వెంకటేశ్వర్ రావు, ఇంతియాజ్ అహ్మద్, షేక్ నబి, తదితరులు ఉన్నారు.
గౌడ కులస్తులకు న్యాయం చేయాలి
నిర్మల్ టౌన్, ఆగస్టు 16 : నిర్మల్ జిల్లాలో నూతన మద్యం పాలసీ అమలవుతున్న నేపథ్యంలో కొందరు కులస్తులకు వైన్స్ షాపుల్లో రిజర్యేషన్ కల్పించినందున సంఘాల ఆధ్వర్యంలో నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారని అటువంటి వారికి వైన్స్షాపులు కేటాయించవద్దని గౌడ కులస్తులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిని కలిసి విన్నవించారు. నిజమైన గౌడ కులస్తులకు న్యాయం చేయాలని కోరారు. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణగౌడ్, ప్రధాన కార్యదర్శి గోపిగౌడ్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, గౌరవాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, కోశాధికారి శ్రీనివాస్గౌడ్, నాయకులు రమణగౌడ్, దశగౌడ్, శంకర్గౌడ్, సత్యనారాయణగౌడ్, లింబగౌడ్ పాల్గొన్నారు.
అటెండర్లను విధుల్లోకి తీసుకోవాలి
నిర్మల్ టౌన్, ఆగస్టు 16 : నిర్మల్ జిల్లాలో పశు వైద్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న 17 మంది అటెండర్లను తొలగించారని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని అటెండర్ల సంఘం నాయకులు బుధవారం మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు సాయన్న, శంకర్, నవీన్, దిలీప్, సాయిరాం, నరేశ్, కిషన్, రాజేశ్వర్, నారాయణ, వినాయక్ పాల్గొన్నారు.
గొల్ల కురుమల సంక్షేమానికి కృషి
సోన్, ఆగస్టు 16: రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులవృత్తులకు ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక సాయం అందజేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ మండలం కొండాపూర్ గ్రామంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కురుమ సంఘ సభ్యులు, నాయకులతో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కురుమలను జీవనోపాధి కోసం గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. అర్హులైన వారికి రెండో విడుతలో గొర్రెలను పంపిణీ చేస్తున్నామని, ఇతర రాష్ర్టాలకు మాంసం ఎగుమతి చేసే విధంగా ఎదగాలని సూచించారు. జిల్లాలోని 9 బీరప్ప ఆలయాలాభివృద్ధికి నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా కురుమ సామాజిక వర్గ ప్రతినిధులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని ్గ ప్రతినిధులు సంఘీభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు, గొల్ల కురుమ సంఘ సభ్యులు, తదితరులు ఉన్నారు.